ఇవ్వాళ రేపు రాష్ట్రంలో వర్ష సూచన..

ఇవ్వాళ రేపు రాష్ట్రంలో వర్ష సూచన..

TGWNEWS/వరంగల్: తెలంగాణలో బండలు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. బయటికి వస్తే భగభగలాడిస్తోన్న ఎండలతో, ఇంట్లో ఉంటే చెమటలు కారిపోయి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే, వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం కలింగించేలా వర్ష సూచన ఉందంటూ.అయితే. ఇవాళ, రేపు కొంత పొడి వాతావరణం నెలకొంటుందని.. ఎల్లుండి మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఇవాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్ష సూచన తెలంగాణలో గతవారం రోజులుగా భానుడు నిప్పులు కురిపిస్తూ, తన ప్రతాపం చూపిస్తున్నాడు. భగభగా మండిపోతున్న ఎండలతో బయటికి రావాలంటేనే భయపడుతోన్న పరిస్థితి నెలకొంది. అయితే, ఇలాంటి సమయంలోనే, వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు ఉపశమనం కలిగించే కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన వాతావరణ శాఖ, ఎల్లుండి మాత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కరిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అందులోనూ, ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ అంచనా గనుక నిజమైనట్టయితే, రాష్ట్ర ప్రజలకు మండుతోన్న ఎండల నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంది.అయితే, వారం రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. అందులోనూ, మూడు నాలుగు రోజులుగా, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవగా, కొన్ని చోట్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో.. ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీచేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, వచ్చినప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ చల్లటి కబురు రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం ఇవ్వనుంది...
 


Post a Comment

0 Comments