కోల్కతాలో భూకంపం...
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. భూప్రకంపనల ధాటికి కార్యాలయాలు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు భయంతో పరుగులు తీశారు. కోల్కతాతో పాటు సమీప జిల్లాల్లోనూ ఈ ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


0 Comments