కాంగ్రెస్ సామాజిక న్యాయానికి నిదర్శనం: వెంకటేశ్వర్లు..
సూర్యాపేట జిల్లా సామాజిక న్యాయ నిబద్ధతకు కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు అన్నారు. కోదాడలో శాసనసభ్యురాలు పద్మావతిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అవకాశం లభించిందని పేర్కొన్నారు. పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
