పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..
పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ నేరేడుచర్లలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు.

No comments:
Post a Comment