నీట్ పేపర్ లీక్పై బీజేపీపై బీఆర్ఎస్ విమర్శలు...
నేరేడుచర్లలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే మరోసారి నీట్ పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. పగలు రాత్రి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందన్నారు. పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్గా కేంద్ర పాలన మారిందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment