దిర్శించర్లలో బడిబాట కార్యక్రమం నిర్వహణ...
దిర్శించర్ల గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బుర్రి శ్రీను, మండల పరిషత్ పాఠశాల హెచ్ఎం, హైస్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, మార్కెట్ డైరెక్టర్, గ్రామ పెద్దలు కలిసి నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలను కలిసి వారి పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రతి బడి ఈడు పిల్లవాడు చదువుకు దూరం కాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

No comments:
Post a Comment