🔴
Loading latest posts...

Tuesday, May 12, 2026

బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలి....

బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలి....

హన్మకొండ, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డివైఎఫ్ఐ జిలా కార్యదర్శి దొగ్గేలా తిరుపతి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్. దీప ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.  మంగళవారం అంబేద్కర్ సెంటర్ లో డివైఎఫ్ఐ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బండి భగీరధ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితురాలు పిర్యాదు చేయడానికి వెళ్తే పోలిసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి12 గంటలకు వరకు బాధితులను స్టేషన్ లో ఉంచి, ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేసారని తెలిపారు. నిందితులు కరీంనగర్ లో బదితురాలిపై "హాని ట్రాప్" కేసు పెట్టె వరకు పోలీసులు వేచి చూసి ఆ తర్వాతే పిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి కలిగిన వారి చుట్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భేటి బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బిజెపి నేతలు దీనికి ఎం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. బిజెపి నాయకుల నుంచి మహిళలకు, బాలికలకు తీవ్ర ముప్పు పొంచిఉండని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దేశాన్ని కుదిపేసిన హత్రస్ ఉన్నవో కేసులో బీజేపీ ప్రభుత్వలు నిందితులను ఎలాగైతే కాపాడే ప్రయత్నం చేశాయో ఇక్కడ అదే ధోరణి కనిపిస్తోంది అని పేర్కొన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ పాత్రపై విచారణ జరిపించాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని నుంచి తొలగించాలి అన్నారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,  పోలీసులు నిందితులకు కొమ్ముకాయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్ళ కు లొంగకుండా బండి భగీరధ్ కు వెంటనే అరెస్టు చేసి, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఎం. రమ, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పరిమళ, రామతరా, యమునా, శ్వేతా, ఉమారాణి, కావ్య, యువన్, రజిత, మయూరి, రంజిత్, అరవింద్, అభినాష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...