🔴
Loading latest posts...

Saturday, May 16, 2026

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...



నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు మలోతు అఖిల్, సర్పంచ్ మలోతు నాగు, మలోతు వినోద్, నాగు, ఈశ్వర్, మహేష్, సైదా తదితరులు పాల్గొన్నారు.

పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..

పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..



పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ నేరేడుచర్లలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు.

Thursday, May 14, 2026

ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?

ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?

ఇంధన పొదుపు కోసం మే 14 నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ తన కాన్వాయ్లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని, ప్రజలు కూడా సహకరించాలని ఇలా చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

రాజకీయాలకు బొత్స గుడ్ బై...

రాజకీయాలకు బొత్స గుడ్ బై...

AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల తర్వాత అనారోగ్యానికి గురైన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కుప్పకూలిపోయారు. ఈ నేపథ్యంలో, ఆయన శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పదవి నుంచి తప్పుకుంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీనిపై సీనియర్లతోచర్చించనున్నారని సమాచారం.

నీరు లేకపోతే ఎలా? అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

నీరు లేకపోతే ఎలా? అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి కీలకమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. శ్రీశైలంలో గరిష్ఠ సామర్థ్యం 215.81 TMCలు కాగా ప్రస్తుతం 39.2 TMCల నీరు ఉంది. ఇక డెడ్ స్టోరేజీ 810 అడుగులకు గానూ 817.7 అడుగుల నీటి నిల్వలున్నాయి. అటు సాగర్లో 312.05 TMCలకు గానూ 157.42 TMCల నీరు ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా 524 అడుగులకు చేరింది. ఇక పులిచింతలలో 32.42TMC (45.77TMC)ల నీరు ఉంది..!

నీట్ పేపర్ లీక్‌పై బీజేపీపై బీఆర్‌ఎస్ విమర్శలు...

నీట్ పేపర్ లీక్‌పై బీజేపీపై బీఆర్‌ఎస్ విమర్శలు...

నేరేడుచర్లలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే మరోసారి నీట్ పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. పగలు రాత్రి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందన్నారు. పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా కేంద్ర పాలన మారిందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దిర్శించర్లలో బడిబాట కార్యక్రమం నిర్వహణ...

దిర్శించర్లలో బడిబాట కార్యక్రమం నిర్వహణ...

దిర్శించర్ల గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బుర్రి శ్రీను, మండల పరిషత్ పాఠశాల హెచ్‌ఎం, హైస్కూల్ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, మార్కెట్ డైరెక్టర్, గ్రామ పెద్దలు కలిసి నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలను కలిసి వారి పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రతి బడి ఈడు పిల్లవాడు చదువుకు దూరం కాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Tuesday, May 12, 2026

బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలి....

బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలి....

హన్మకొండ, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డివైఎఫ్ఐ జిలా కార్యదర్శి దొగ్గేలా తిరుపతి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్. దీప ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.  మంగళవారం అంబేద్కర్ సెంటర్ లో డివైఎఫ్ఐ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బండి భగీరధ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితురాలు పిర్యాదు చేయడానికి వెళ్తే పోలిసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి12 గంటలకు వరకు బాధితులను స్టేషన్ లో ఉంచి, ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేసారని తెలిపారు. నిందితులు కరీంనగర్ లో బదితురాలిపై "హాని ట్రాప్" కేసు పెట్టె వరకు పోలీసులు వేచి చూసి ఆ తర్వాతే పిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి కలిగిన వారి చుట్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భేటి బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బిజెపి నేతలు దీనికి ఎం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. బిజెపి నాయకుల నుంచి మహిళలకు, బాలికలకు తీవ్ర ముప్పు పొంచిఉండని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దేశాన్ని కుదిపేసిన హత్రస్ ఉన్నవో కేసులో బీజేపీ ప్రభుత్వలు నిందితులను ఎలాగైతే కాపాడే ప్రయత్నం చేశాయో ఇక్కడ అదే ధోరణి కనిపిస్తోంది అని పేర్కొన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ పాత్రపై విచారణ జరిపించాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని నుంచి తొలగించాలి అన్నారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,  పోలీసులు నిందితులకు కొమ్ముకాయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్ళ కు లొంగకుండా బండి భగీరధ్ కు వెంటనే అరెస్టు చేసి, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఎం. రమ, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పరిమళ, రామతరా, యమునా, శ్వేతా, ఉమారాణి, కావ్య, యువన్, రజిత, మయూరి, రంజిత్, అరవింద్, అభినాష్ తదితరులు పాల్గొన్నారు.

బండి భగీరథ్ పైన తక్షణమే విచారణ జరపాలి : సీఎం రేవంత్..

బండి భగీరథ్ పైన తక్షణమే విచారణ జరపాలి : సీఎం రేవంత్.. 

బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన  నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కి డీజీపీ వివరించారు.కేసు స‌మ‌గ్ర‌ విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు..

మైనర్ బాలిక ఘటనపై నేరేడుచర్లలో నిరసన...

మైనర్ బాలిక ఘటనపై నేరేడుచర్లలో నిరసన...

నేరేడుచర్ల చౌరస్తాలో బీఆర్‌ఎస్‌వై విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బండి సాయి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్, భగీరథకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిత్రపటాలను దహనం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

Monday, May 11, 2026

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి...

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి...

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి సోమవారం పదవి బాధ్యతలు తీసుకున్నారు. కాగా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి Conversation బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు.

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు ..

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు ..

హైదరాబాద్, మే 11: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో నిర్వహించాలని డీజీపీ నిర్ణయించినట్లు సమాచారం. బాధితురాలు బాలిక కావడం, కేసులో ఉన్న ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని విచారణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటికే సిట్ బృందం కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. బాధిత బాలిక స్టేట్మెంట్‌ను చట్టపరమైన నిబంధనల ప్రకారం పోలీసులు నమోదు చేశారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని కీలక విషయాలను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలించే అవకాశముందని సమాచారం. కేసులో ఉన్న ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా విచారించి నిజానిజాలు వెలికితీసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

రేపు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు...

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభాపక్ష ఉపనాయకులతో సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జిల నియామకం, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు సమాచారం. రానున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ వ్యూహాలపై కూడా చర్చలు జరిగే అవకాశముంది.

వికలాంగుల హక్కుల కోసం ప్రభుత్వానికి డిమాండ్...

వికలాంగుల హక్కుల కోసం ప్రభుత్వానికి డిమాండ్...

నేరేడుచర్లలో జరిగిన వివాహ వేడుకల్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని పెంచడం, పెన్షన్లు, ఉద్యోగ అవకాశాలు, ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి హామీలను అమలు చేయాలని కోరారు. సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. లేనిపక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు...

రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు...

 తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతున్నప్పటికీ మరోవైపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో పలుజిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. రాజధాని హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Sunday, May 10, 2026

కాంగ్రెస్ సామాజిక న్యాయానికి నిదర్శనం: వెంకటేశ్వర్లు..

కాంగ్రెస్ సామాజిక న్యాయానికి నిదర్శనం: వెంకటేశ్వర్లు..

సూర్యాపేట జిల్లా సామాజిక న్యాయ నిబద్ధతకు కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు అన్నారు. కోదాడలో శాసనసభ్యురాలు పద్మావతిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అవకాశం లభించిందని పేర్కొన్నారు. పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

మోడీ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు...

మోడీ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు...

హుజూర్ నగర్ పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు. పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయిస్తోందని, రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు తెలిపారు.

Saturday, May 9, 2026

బాలికపై పాస్టర్ అత్యాచారం...

 బాలికపై పాస్టర్ అత్యాచారం...

ఏలూరు గుడివాడ:ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరింపు.కామవరపుకోట ఓ చర్చి పాస్టర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నెలసరి తప్పడంతో గర్భనిరోధక మాత్రలు వేశాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం బాధ్యతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు . బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోట మండలం.కళ్ళచెరువుకు చెందిన పాస్టర్ చౌటపల్లి రాంబాబు చర్చి ఏర్పాటు చేసుకొని ప్రార్థనలను నిర్వహించేవాడు ఈ క్రమంలో కూలి పనులు చేసుకునే ఓ కుటుంబం ఆయన వద్దకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేవారు. వారి కుమార్తె (14) పై కన్నేసిన పాస్టర్ తరచూ ఆమెపై అత్యాచారం చేస్తూ ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరించేవాడు. దీంతో ఆ బాలిక ఎవరికి చెప్పలేదు. ఈ నేపథ్యంలో బాలిక నెలసరి రాకపోవడంతో గర్భనిరోధక మాత్రలు అధిక మోతాదులో పాస్టర్ వాడించాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ తల్లికి జరిగిన విషయం చెప్పింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధ్యాత్మిక ప్రార్థనల పేరుతో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్ కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

తడికలపూడి ఎస్సై వల్లి పద్మ కేసు నమోదు చేశారు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం

వర్షాలు ఎక్కెడెక్కడ పడనున్నాయో తెలుసా.... ?

వర్షాలు ఎక్కెడెక్కడ పడనున్నాయో తెలుసా.... ?

శ్రీలంక మీదుగా ఉన్న ఆవర్తనం రానున్న 72 గంటల్లో అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో మన రాష్ట్ర కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలో తెల్లవారుజామున వర్షాలు పడే అవకాశం ఉంది. అదే విదంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో ఉత్తరాంధ్రలోని వైజాగ్ మరియు మధ్య ఆంధ్రలోని విజయవాడ-గోదావరి ప్రాంతాలలో ఈ రోజు, రేపు వర్షాలు తగ్గి సోమవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది.




ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...